భారత క్రికెట్ జట్టులో వెటరన్ ఆటగాళ్ల కొనసాగింపుపై చర్చ జరుగుతున్న సమయంలో పాక్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు.
షాహిద్ అఫ్రిది
భారత క్రికెట్ జట్టులో వెటరన్ ఆటగాళ్ల కొనసాగింపుపై చర్చ జరుగుతున్న సమయంలో పాక్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుత ప్రదర్శన తర్వాత షాహిద్ అఫ్రిది వారిని 2027 ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగించాలని గట్టిగా వాదించారు. టీమిండియా ఈ ఇద్దరు దిగ్గజాలను తెలివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. బలహీన జట్లతో ఆడేటప్పుడు వారికి విశ్రాంతి ఇచ్చి కీలక సిరీస్లలో వారిని ఆడించాలని చెప్పారు. ‘గౌతమ్ తన పదవీకాలాన్ని ప్రారంభించిన తీరు చూస్తే, తాను అనుకున్నది, తాను చెప్పింది మాత్రమే సరైనదని అతను భావించినట్లు అనిపించింది. కానీ కొంతకాలం తర్వాత, మీరు ఎల్లప్పుడూ సరైనవారు కారని నిరూపించబడింది’ అని విమర్శలు గుప్పించారు.