భర్తపై సెలీనా జైట్లీ గృహ హింస కేసు

భర్తపై సెలీనా జైట్లీ గృహ హింస కేసు

celina jaitly

 

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు పెట్టారు. తన భర్త నుంచి గృహ హింస, క్రూరత్వం, మానిప్యులేషన్ ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఆమె ముంబై కోర్టును ఆశ్రయించారు. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు దాఖలు చేయగా, న్యాయస్థానం పీటర్ హాగ్ కు నోటీసులు జారీ చేసింది. ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త, హోటలియర్ అయిన పీటర్ హాగ్ ను సెలీనా 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో కవల కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2017లో మరోసారి కవలలకు జన్మనివ్వగా, వారిలో ఒకరు గుండె సంబంధిత సమస్యతో మరణించారు. సెలీనా జైట్లీ ప్రస్తుతం ఒకేసారి రెండు వైపులా న్యాయపోరాటం చేస్తున్నారు. గత నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీని అక్రమంగా అపహరించి, నిర్బంధించారంటూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. 2024 సెప్టెంబర్ నుంచి నిర్బంధంలో ఉన్న తన సోదరుడి యోగక్షేమాల గురించి విదేశాంగ శాఖ సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. దీనిపై స్పందించిన కోర్టు, ఆమె సోదరుడితో పాటు అతని భార్యతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్