బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడ ఆమెను అసలు పట్టించుకోవట్లేదు.
పూజా హెగ్డే
బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడ ఆమెను అసలు పట్టించుకోవట్లేదు. ఐతే కోలీవుడ్ లో కాస్త పర్వాలేదు అన్నట్టు పరిస్థితి మొన్నటిదాకా కనిపించగా ఇప్పుడు అక్కడ కూడా అమ్మడికి బ్యాడ్ లక్ మొదలైంది. తమిళ్ లో సూర్యతో రెట్రో చేసిన పూజా హెగ్దే ప్రస్తుతం దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు లారెన్స్ చేస్తున్న కాంచన 4లో ఆమె ఛాన్స్ అందుకుంది. ఐతే ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్దే అవకాశం అందుకుందని టాక్. ధనుష్ తో రాజ్ కుమార్ పెరియసామి చేయబోతున్న సినిమాలో ముందు పూజా హెగ్దేనే హీరోయిన్ గా అనుకున్నారట. ఐతే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో సాయి పల్లవినే ఫైనల్ చేశారని తెలుస్తుంది. ముందు సినిమాలో సాయి పల్లవినే తీసుకోవాలని అనుకోగా ఆమె బాలీవుడ్ రామాయణ్ లో నటిస్తుంది కాబట్టి డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా లేదా అన్న డౌట్ ఉండేదట. కానీ ఆల్రెడీ తనకు అమరన్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి ధనుష్ సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పిందని తెలుస్తుంది.