ప్రయాణికులకు ఇండిగో స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణికుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందించనుంది.
ఇండిగో
ప్రయాణికులకు ఇండిగో స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణికుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందించనుంది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 3, 4, 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తామని ఎయిర్లైన్ తెలిపింది. విమాన ఆలస్యాలు, రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్లను రిడీమ్ చేసుకోవచ్చని తెలిపింది. రద్దు చేసిన అన్ని విమానాలకు రీఫండ్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది.