2027 వేసవిలో వారణాసి రిలీజ్: కీరవాణి

2027 వేసవిలో వారణాసి రిలీజ్: కీరవాణి

varanasi

ప్రతీకాత్మక చిత్రం

మహేష్ బాబు -రాజమౌళి కాంబినేష‌న్ మూవీ వారణాసి గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వైభ‌వంగా జ‌రిగింది. అయ‌తే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే టైటిల్ లీక్ అయింది. ఈ వేదిక‌పై రాజ‌మౌళి మాట్లాడుతూ.. ఒక‌రోజు ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ వ‌చ్చి ప్ర‌తిదీ షూట్ చేసి వెళ్లింద‌ని, కోట్లాది రూపాయ‌లు వెచ్చించి శ్ర‌మిస్తే త‌మ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన‌ట్ట‌యింద‌ని ఆవేద‌న చెందారు. ఇక ఈ వేదిక‌పై అద్భుత ప్ర‌సంగంతో ఆక‌ట్టుకున్న ఎం.ఎం.కీర‌వాణి, వార‌ణాసి రిలీజ్ స‌మ‌యాన్ని వెల్ల‌డించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ-`వారణాసి 2027 వేసవిలో విడుద‌ల‌వుతుంద‌`ని వెల్లడించారు. ఈ వేసవి నుండి మహేష్ బాబు అభిమానుల హృదయాల్లో తాను శాశ్వత స్థానాన్ని సంపాదిస్తానని ఆయన అన్నారు. మెలోడీలే కాదు ఇకపై అన్ని ర‌కాల బాణీల‌తోను అద‌ర‌గొడ‌తాన‌ని ఈ సినిమా నిరూపిస్తుంద‌ని కీరవాణి ఛాలెంజ్ చేసారు. బీట్ విష‌యంలో త‌న‌పై వ‌చ్చిన అపప్ర‌ద తొల‌గిపోతుంద‌ని కీర‌వాణి అన్నారు. ఇక రాజమౌళి-మ‌హేష్‌తో 15 ఏళ్ల క్రిత‌మే సినిమా కోసం ప్ర‌య‌త్నించాన‌ని దుర్గా ఆర్ట్స్ అధినేత‌, సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ వేదిక‌పై వెల్ల‌డించారు. అది ఇప్ప‌టికి కుదిరింద‌ని అన్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించార‌ని రాజ‌మౌళి తెలిపారు.ఇక ఈ వేదిక‌పై పృథ్వీరాజ్ పాత్రను వివరించడానికి, కీరవాణి బృందం వేదికపై ప్రత్యక్షంగా ఒక పాటను ప్రదర్శించారు. ఇది అభిమానులను ఎగ్జ‌యిట్ చేసింది. ఇక రామోజీ ఫిలింసిటీలో వార‌ణాసి సెట్ ని నిర్మించేందుకు అత్యంత భారీగా ఖ‌ర్చ‌యింద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.


నేటి బాలలే రేపటి సమాజ సేవకులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్