||మహేంద్ర సింగ్ ధోనీ Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఈ ఐపీఎల్తో తన క్రికెట్ కెరీర్కు ముగింపు పలుకుతాడని భావించిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పాడు. వచ్చే ఐపీఎల్ కూడా ఆడతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన అనంతరం మాట్లాడుతూ.. మరో 9 నెలల్లో జరగబోయే ఐపీఎల్-2024 టోర్నీలోనూ ఆడతానని వెల్లడించాడు. ‘ప్రతి ట్రోఫీ స్పెషలే. ఇది కూడా అలాంటిదే. ఫైనల్ మ్యాచ్లో చెన్నై బౌలింగ్ బాగోలేదు. అయితే, ఆ ఒత్తిడిని బ్యాటర్లు తీసుకొని, జట్టును విజయతీరాలకు చేర్చారు. అజింక్య రహానే, ఇతర క్రికెటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి గెలిపించారు. అంబటి రాయుడు రిటైర్మెంట్ గురించి చెప్పాలంటే.. అతడు కూడా నాలాంటి వాడే. ఎక్కువగా ఫోన్ వాడడు. ఫీల్డ్లో ఉంటే తాను 100 శాతం కృషి చేసే క్రికెటర్. అయితే, రాయుడు జట్టులో ఉంటే.. నేను ఎప్పటికీ ఫేర్ ప్లే అవార్డు గెలవలేను (నవ్వుతూ). జీవితాన్ని మరింత గొప్పగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపాడు.