అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్లో 39 పరుగులు

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డు నమోదయింది. సాధారణంగా ఓవర్లో ఆరు బాల్స్ కు ఆరు సిక్స్ లు కొడితే 36 పరుగులు వస్తాయి. ఇదే ఇప్పటి వరకు రికార్డుగా కొనసాగుతోంది. తాజాగా జరిగిన టి20 ప్రపంచ కప్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ రీజియన్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు - సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్ లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా, సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది.

Batter Darius Visser

బ్యాటర్ డారియస్ విసెర్

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డు నమోదయింది. సాధారణంగా ఓవర్లో ఆరు బాల్స్ కు ఆరు సిక్స్ లు కొడితే 36 పరుగులు వస్తాయి. ఇదే ఇప్పటి వరకు రికార్డుగా కొనసాగుతోంది.  తాజాగా జరిగిన టి20 ప్రపంచ కప్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ రీజియన్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు - సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్ లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా, సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారియస్ విసెర్ ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. క్వాలిఫైయర్స్ లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో సమోవా 10 పరుగులు తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. విసెర్ 62 బంతుల్లో 132 పరుగులు (5 ఫోర్లు, 14 సిక్సర్లు) సాధించాడు. మిగిలిన వాళ్ళు విఫలమయ్యారు.  అనంతరం లక్ష్య సాధనలో వణువాటు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 164 పరుగులు చేసింది. నలిన్ లిపికో 52 బంతుల్లో 73 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో పోరాడిన ఫలితం లేకపోయింది. 

39 పరుగులు రాబట్టింది ఇలా..

వనవాటు బౌలర్ నలిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో డారియస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరసుగా 6, 6, 6, 1నోబాల్, 6, 0, 1 నోబాల్, 6 ప్లస్ 1 నోబాల్, 6 పరుగులు సాధించి ఒకే ఓవర్ లో 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ (భారత్ : 2007లో ఇంగ్లాండ్ పై : స్టువర్టు బ్రాడ్), కీరన్ పోలార్డ్ (వెస్టిండీస్ : 2021లో శ్రీలంకపై : అఖిల ధనుంజయ),  నికోలస్ పూరన్ (వెస్టిండీస్ : 2024లో ఆఫ్ఘనిస్తాన్ పై అజ్మతుల్లా ఒమర్ జాయ్), దీపేంద్ర సింగ్ (నేపాల్ : 2024 లో ఖతర్ పై : కమ్రాన్ ఖాన్),  రోహిత్ శర్మ - రింకూ సింగ్ (భారత్ : 2024లో ఆఫ్ఘనిస్తాన్ పై : కరీమ్ జన్నత్) కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించారు. అయితే, తాజా మ్యాచ్ లో వనువాటు బౌలర్ అదనంగా మూడు నోబాల్స్ వేయడంతో మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఒక టి20 ఇన్నింగ్స్ జట్టు స్కోర్ లో అత్యధిక శాతం పరుగులు చేసిన ప్లేయర్ గా విసెర్ రికార్డుల్లోకి ఎక్కాడు. సమోవా జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా, అందులో ఒక్కడే 132 పరుగులు సాధించాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో 75.86% పరుగుల విసెర్ బ్యాట్ నుంచి వచ్చాయి. గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్ అరోన్ పించ్ బ్యాట్ నుంచి 75.01 ఒక శాతం పరుగులు వచ్చాయి. ఆ రికార్డును ఇప్పుడు విసెర్ అధిగమించాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్