భారత్ - శ్రీలంక జట్ల మధ్య నేడే తొలి వన్డే.. జట్టులో తిరిగి చేరిన సీనియర్ ఆటగాళ్లు

టీమిండియా శ్రీలంక పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. టి20 సిరీస్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని పల్లకిల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

ODI series

వన్డే సిరీస్ 

టీమిండియా శ్రీలంక పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. టి20 సిరీస్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని పల్లకిల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టి20 సిరీస్ కు దూరంగా ఉన్న భారత సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్ కు మళ్లీ జట్టులో చేరారు. మూడు టి20 మ్యాచ్ ల్లో విజయం సాధించిన భారత జట్టు టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకునే దిశగా భారత జట్టు అడుగులు వేస్తోంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో విజయం సాధించి సిరీష్ పై పట్టు బిగించాలని భారత జట్టు భావిస్తుండగా.. గట్టి పోటీ ఇవ్వాలన్న కసితో శ్రీలంక జట్టు బరిలోకి దిగుతోంది. 

టి20 సిరీస్ ఆడిన జట్టుతో పోలిస్తే వన్డే సిరీస్ కు సీనియర్లు జతకావడంతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ చేరికతో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారింది. ఈ మ్యాచ్ లో కొత్త వారికి కూడా అవకాశం కల్పించనున్నారు. హర్షిత్ రానా, రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ తో వన్డే అరంగేట్రం చేయనున్నారు. 

రెండు జట్ల మధ్య గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..? 

భారత - శ్రీలంక జట్లు మధ్య జరిగిన వన్డే మ్యాచ్లను పరిశీలిస్తే భారత జట్టు స్పష్టమైన ఆధిక్యతను కనబరిచినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 166 వన్డే మ్యాచ్లు ఆడగా భారత జట్టు 99 మ్యాచుల్లో విజయం సాధించింది. శ్రీలంక జట్టు 57 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో పదకొండు మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి వన్డే జరుగుతున్న కొలంబో పిచ్ లో గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ ఇరు జట్లు 38 మ్యాచులు ఆడగా భారత జట్టు 19 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. శ్రీలంక జట్టు 16 మ్యాచ్లో విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇరుజట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్ ల్లో భారత జట్టే విజయాన్ని సాధించింది 

ఇది టీమ్ ఇండియా తుది అంచనా 

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్ధీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రానా


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్