||క్రిస్మస్ వేడుకల్లో ఎంఎస్ ధోనీ అండ్ ఫ్యామిలీ||
మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ.. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటున్నాడు. తాను స్వయంగా పోస్ట్ చేయకపోయినా, ఆయన భార్య సాక్షి, కూతురు జీవా ఇన్స్టాగ్రామ్లో అలరిస్తూ ఉంటున్నాడు. ఆ మధ్య వరుస కార్యక్రమాలకు హాజరై సెల్ఫీలకు ఫోజులిచ్చిన ధోనీ.. రాబోయే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ను పురస్కరించుకొని ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. తన భార్య సాక్షి, కూతురు జీవా, ఇతర కుటుంబసభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సెలబ్రేషన్స్కు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా హాజరయ్యాడు. వీరంతా కలిసి శాంటా డ్రెస్లో దిగిన ఫొటోను జీవా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా ధోనీ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు రిషబ్ పంత్ నిత్యం హాజరవుతూనే ఉన్నాడు. తాజాగా జీవా పోస్ట్ చేసిన ఈ ఫొటోను చూసిన వారంతా లైక్లతో హోరెత్తిస్తున్నారు.