దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత జట్టు వాటిని పాలయింది. స్వల్ప స్కోరింగ్ మ్యాచ్ లో ఆసక్తిగా హోరాహోరీని తలపించిన ఈ మ్యాచ్ లో ఓటమి అంచులు వరకు వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయాన్ని నమోదు చేసింది. చివరి మూడు ఓవర్ల వరకు భారత జట్టు ఉన్న విజయం.. అద్భుతమైన ఆట తీరుతో స్టబ్స్ దక్షిణాఫ్రికాకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
విన్నింగ్ షాట్ అనంతరం స్టబ్స్ ఆనందం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత జట్టు వాటిని పాలయింది. స్వల్ప స్కోరింగ్ మ్యాచ్ లో ఆసక్తిగా హోరాహోరీని తలపించిన ఈ మ్యాచ్ లో ఓటమి అంచులు వరకు వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయాన్ని నమోదు చేసింది. చివరి మూడు ఓవర్ల వరకు భారత జట్టు ఉన్న విజయం.. అద్భుతమైన ఆట తీరుతో స్టబ్స్ దక్షిణాఫ్రికాకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. రెండో టి20 దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో నాలుగు టి20 మ్యాచ్ లు సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో సమానంగా నిలిచాయి. గేబెహ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు స్వల్ప స్పోర్ కు పరిమితమైంది. 20 ఓవర్లలో ఆరు వికెట్లను నష్టపోయి 124 పరుగులు మాత్రమే చేసింది. అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు భారత బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పరుగులు చేయలేక టాపార్డర్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పెట్టారు. తొలి టీ20లో సెంచరీ తో అదరగొట్టిన సంజు శాంసన్ (0) దక్షిణాఫ్రికా జట్టు పేసర్ జాన్సన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తరువాతి ఓవర్ లోనే అభిషేక్ ను (4) కొట్జి దెబ్బతీశాడు. కెప్టెన్ సూరి కుమార్ యాదవ్ (4) ను సిమిలానే ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో భారత జట్టు 15 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, అక్షర పటేల్ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేయడంతో స్కోర్లో వేగం పెరిగింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత జట్టు 34/3 తో నిలిచింది. కానీ ఆ తర్వాతే తిలక్ వర్మ ఇచ్చిన కాచిన దేవుడి మిల్లర్ గాల్లోకి ఎగిరి మరి పట్టేయడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత కొద్దిసేపటికి స్పీడుగా ఆడుతున్న అక్షర పటేల్ రన్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ (9) కూడా విఫలం కావడంతో భారత జట్టు కష్టాలు కొనసాగాయి. చివరకు 16 ఓవర్లో అర్స్ దీప్ ఒక సిక్స్ బాదాడు. 17వ ఓవర్ లో హార్దిక్ పాండ్యా ఒక ఫోర్ కొట్టడంతో స్కోరుబోర్డు వందకు చేరింది. ఆ తరువాతి ఓవర్లో అతడు 4, 6, 4 తో 14 రన్స్ వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో హార్దిక్ ఇచ్చిన రెండు క్యాచ్లు విఫలం కాగా, ఆరు పరుగులు మాత్రమే రావడంతో 124 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణ ఆఫ్రికా జట్టు వేగంగా ఆడే కార్యక్రమంలో చతికిలపడింది. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లను పెవిలియన్ బాట పట్టించి భారత జట్టు గెలుపు ఆలోచనకు కారణం అయ్యాడు. అయితే చివరి వరకు క్రీజులో నిలిచిన స్టబ్స్ దక్షిణాఫ్రికా జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా పరుగులు చేసే ఇబ్బందులు పడ్డారు. మూడో ఓవర్ లోనే ఓ పిల్లర్ రికల్టన్ (13) ను అవుట్ చేయడం ద్వారా అర్స్ దీప్ తొలి వికెట్ ను భారత జట్టుకు అందించాడు. ఆ తరువాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మ్యాజిక్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికా జట్టు నడ్డి విరిచాడు. తన వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాను తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు.
కెప్టెన్ మార్క్రమ్ (3), ఓపెనర్ హేన్రిక్స్, జాన్సన్ (7), మిల్లర్ (0) వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బౌల్డ్ అయి వెనుదిరిగారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లోనే అవుట్ అయిన క్లాసెన్ (2) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో దక్షిణాఫ్రికా జట్టు 66 పరుగులకే ఆరు వికెట్లను నష్టపోయి ఏ కలలోకి కష్టాల్లో పడింది. చివరి వరకు క్రీజులో నిలిచిన స్టబ్స్ ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లతో జట్టును ముందుకు నడిపించాడు. 17వ ఓవర్ లో భారీ సిక్స్ ను కొట్జి కొట్టగా, అదే ఓవర్లో స్టబ్స్ బోర్ కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి. 18 ఓవర్ లో కొట్జి వరుసుగా రెండు ఫోర్లు కొట్టడంతో 12 బంతుల్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది. 19 ఓవర్లో స్టబ్స్ నాలుగు ఫోర్లు కొట్టడంతో 7 వికెట్లను నష్టపోయి దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని చేరుకునే విజయం సాధించింది. తుది వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించి పెట్టిన స్టబ్స్ (47) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గెలిచాడు.