ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. అంతకంటే ముందుగానే భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ధనా ధన్ పోరు అలరించనుంది. ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ బుధవారం ఆడనుంది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే సూర్యకుమార్ నేతృత్వంలోని యువ భారత్ జట్టు బరిలోకి దిగుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. అంతకంటే ముందుగానే భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ధనా ధన్ పోరు అలరించనుంది. ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ బుధవారం ఆడనుంది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే సూర్యకుమార్ నేతృత్వంలోని యువ భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. అటు పర్యాటక ఇంగ్లాండ్ జట్టు కూడా యువకులతో నిండి ఉంది. ప్రస్తుత జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లకు భారత్లో టి20 మ్యాచ్ ఆడిన అనుభవమే లేదు.
తొలి టీ-20 మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు ఏడాది విరామం తర్వాత పేసర్ మహమ్మద్ షమీ బరిలోకి దిగుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో విశేషంగా రాణించిన తను ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోలుకుని దేశవాలీల్లో మెరుగ్గా రాణించి సెలక్టర్లను ఆకర్షించాడు. దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్ తోపాటు ఛాంపియన్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజా సిరీస్ అతడికి అత్యంత కీలకం కానుంది. ఏడాది తరువాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంతో షమీ మైదానంలో ఎలా రాణిస్తాడు అనేది తేలాల్సి ఉంది. బుమ్రా గాయంతో బాధపడుతున్న వేళ షమీ అంచనాలకు తగ్గట్టుగా రాణించాల్సి ఉంది. అలాగే తను ఈ ఫార్మాట్ లో 2022లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో చివరిసారి ఆడడం గమనార్హం. ఇక వైస్ కెప్టెన్ హోదాలో అక్షర్ పటేల్ కు ఇది తొలి మ్యాచ్ కానుంది. గడిచిన ఏడాది టీ20 మెగా టోర్నీలో తను ఆల్రౌండర్ గా ఆకట్టుకున్నాడు. అలాగే, దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో సెంచరీలు బాదిన సంజూ సంశాన్ తోపాటు తిలక్ వర్మ కూడా భీకర ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సెంచరీ బాదిన నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. కెప్టెన్ సూర్య కుమార్, రింకు, హార్దిక్ పాండ్యాలతో కలిపి ఓవరాల్ గా భారత్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక స్పిన్ త్రయం అక్షర్, వరుణ్, బిష్ణోయ్ ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేస్తే ఇక తిరుగే ఉండదు.
ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఇంగ్లాండ్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో మొదటిసారి ఇంగ్లాండ్ జట్టు బరులోకి దిగబోతోంది. టెస్టుల్లోనే బజ్ బాల్ గేమ్ తో ఆట స్వరూపాన్ని మార్చిన మెకల్లమ్ భారత్ తో పొట్టి పోరుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండు తుది జట్టును ప్రకటించడంతో బెన్ డక్కెట్, ఫిల్ సాల్ట్ ఓపెనర్లుగా రానున్నారు. కేకేఆర్ మాజీ ఆటగాడు అయినా సాల్ట్ కు ఈడెన్ గ్రౌండ్ ఫై చక్కటి అవగాహన ఉంది. టోప్లే, కర్రాన్, విల్ జాక్స్ జట్టులో లేకపోయినా.. 21 ఏళ్ల జాకబ్ బేదేల్ ల్ పై ఇంగ్లాండ్ జట్లు నమ్మకం పెట్టుకుంది. తను ఆడిన ఏడు టి20 మ్యాచుల్లో 57.66 సగటుతో ఉన్నాడు. ఇక షమీ మాదిరిగానే గాయం నుంచి కోల్కున్న పేసర్ జాఫ్రా ఆర్చర్ రాణించడంపై పర్యాటకు జట్టు దృష్టి సారించింది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ బట్లర్, బ్రూక్, లివింగ్ స్టోన్ కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇక పిచ్, వాతావరణం గురించి పరిశీలిస్తే.. గడిచిన ఏడాది ఈడెన్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల సగటు స్కోర్ 198. ఎనిమిది సార్లు ఇక్కడ 200కిపైగా స్కూల్లో నమోదు కావడం విశేషం. బుధవారం నాటి మ్యాచ్లోను పరుగుల వరద పారడం ఖాయమే. మంచు ప్రభావం అధికం కావడంతో టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది.