పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. షూటింగ్‌లో సత్తా చాటిన మనుబాకర్‌

పారిస్‌-2024 ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌ పతకాలు ఖాతాను తెరిచింది. పది మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ మహిళల ఫైనల్‌లో మనుబాకర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పతాకం రెపరెపలాడింది. షూటింగ్‌లో భారత్‌కు మెడల్‌ సాధించిన తొలి మహిళా షూటర్‌గా మనుబాకర్‌ చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియాకు చెందన ఓయే జిన్‌ స్వర్ణం కైవశం చేసుకోగా, అదే దేశానికి చెందిన కిమ్‌ యేజి రజతం సాధించింది. భారత్‌కు చెందిన మనుబాకర్‌ కాంస్య పతకాన్ని నెగ్గింది.

manubakar

 మనుబాకర్‌ 

పారిస్‌-2024 ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌ పతకాలు ఖాతాను తెరిచింది. పది మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ మహిళల ఫైనల్‌లో మనుబాకర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పతాకం రెపరెపలాడింది. షూటింగ్‌లో భారత్‌కు మెడల్‌ సాధించిన తొలి మహిళా షూటర్‌గా మనుబాకర్‌ చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియాకు చెందన ఓయే జిన్‌ స్వర్ణం కైవశం చేసుకోగా, అదే దేశానికి చెందిన కిమ్‌ యేజి రజతం సాధించింది. భారత్‌కు చెందిన మనుబాకర్‌ కాంస్య పతకాన్ని నెగ్గింది. స్వర్వ పతకం సాధించిన ఓయే జిన్‌ ఓవరాల్‌గా 242.2 పాయింట్లు సాధించగా, రజతం సాధించిన కిమ్‌ యేజీ 241.3 పాయింట్లు, మనుబాకర్‌ 221.7 పాయింట్లు మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో భారత్‌ సాధించిన ఐదో పతకం ఇది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ నుంచి లండన్‌ 2012 ఒలింపిక్స్‌ వరకు వరుసగా మూడు విశ్వక్రీడల పోటీల్లో షూటింగ్‌ విభాగంలో భారత్‌ పతకాలు సాధించింది. గత రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం రాలేదు. తాజాగా పారి ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల మనుబాకర్‌ కాంస్యం పతకాన్ని సాధించడంతో మరోసారి షూటింగ్‌ విభాగంలో పతకం వచ్చినట్టు అయింది. 

2004లో జరిగిన ఒలింపిక్స్‌లో రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ భారత్‌కు తొలి షూటింగ్‌ మెడల్‌ సాధించాడు. బీజింగ్‌ 2008 ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా పది మీటర్లు ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం సాధించగా, 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో గగన్‌ నారంగ్‌ పది మీటర్లు ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజతం, 25 మీటర్లు ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో విజయ్‌ కుమార్‌ కాంస్యం పతకాన్ని సాధించారు.తాజాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మనుబాకర్‌ క్యాంస పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు షూటింగ్‌లో నాలుగు పతకాలు తెచ్చిన క్రీడాకారులంతా పురుషులు కాగా, తొలిసారి మహిళ కాంస్య పతకాన్ని సాధించింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్