ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు చిక్కులు తప్పినట్టే.. హైబ్రిడ్ మోడల్ కు పాక్ ఒకే.!

గడిచిన కొద్ది రోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఈ మెగా వన్డే టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో భారత్ - పాక్ మధ్య మ్యాచులు తటస్థ వేదికపై జరగనున్నాయి. అలాగే భారత్ లో జరిగే 2025 మహిళల వన్డే వరల్డ్ కప్, 2026 పురుషుల టి20 వరల్డ్ కప్, 2027 ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు నిర్వహించే మహిళల టీ20 వరల్డ్ కప్ లోను ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన కొద్ది రోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఈ మెగా వన్డే టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో భారత్ - పాక్ మధ్య మ్యాచులు తటస్థ వేదికపై జరగనున్నాయి. అలాగే భారత్ లో జరిగే 2025 మహిళల వన్డే వరల్డ్ కప్, 2026 పురుషుల టి20 వరల్డ్ కప్, 2027 ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు నిర్వహించే మహిళల టీ20 వరల్డ్ కప్ లోను ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. అప్పుడు కూడా ఇరుజట్ల మధ్య మ్యాచులు తటస్థ వేదికలపైనే జరుగుతాయని తేల్చింది. ప్రస్తుత సీజన్ లో భారత్ పాక్ జట్లు ఐసిసి టోర్నీలో ఆడే అన్ని మ్యాచ్లను తటస్థ వేదికలో జరిపేందుకు ఆమోదించినట్లు ఐసిసి ప్రకటించింది. ఈ మేరకు త్వరలోనే టోర్నీ షెడ్యూల్ ప్రకటిస్తామని ఐసిసి వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల రీత్యా భారత క్రికెట్ జట్టు పార్క్ లో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించిన విషయం తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకపోవడంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని భారత్ కోరింది. అటు పాకిస్థాన్ మాత్రం దీనికి అంగీకరించలేదు.

దీంతో కొద్దిరోజులుగా ఈ టోర్నీ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. చివరకు పాకిస్తాన్ ను హైబ్రిడ్ పద్ధతికి ఒప్పించడంతో ఈ కథ సుఖాంతమైనట్టు అయింది. టోర్నీని  ఆద్యంతం పాకిస్తాన్ లోనే నిర్వహించాలని పట్టుబట్టినా ఎట్టకేలకు హైబ్రిడ్ పద్ధతికి ఆ దేశ క్రికెట్ బోర్డు పచ్చజెండా ఊపింది. ఇప్పుడు భారత్ - పాక్ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. రేసులో శ్రీలంక, యూఏఈ ఉన్నప్పటికీ.. ఐసీసీ మాత్రం ఎడారి దేశం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఐపీఎల్, టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు విజయవంతంగా జరిగాయి. దీనికితోడు దుబాయ్, షార్జా, అబుదాబీలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. భారత్ - పాక్ అభిమానులు కూడా సులువుగా ఇక్కడికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఐసిసి చైర్మన్ జైషాకు యూఏఈ నిర్వహణ సామర్థ్యంపై చక్కటి గురి ఉండడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా భారత్ తో అనుకున్నట్టుగానే హైబ్రిడ్ పద్ధతిలో తటస్థ వేదికలో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లు నిర్వహణకు ఏర్పాటు జరుగుతుండడం గమనార్హం. భారత్ అనుకున్నట్టుగానే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడే మ్యాచ్లు హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేలా పాకిస్తాన్ ను ఒప్పించడంలో విజయవంతమైంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్