||టీమిండియా Photo: bcci Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: భారత్లో అక్టోబర్ 5వ తేదీ నుంచ జరిగే వన్డే వరల్డ్ కప్ 2023కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో టీమ్ను వెల్లడించింది. రోహిత్ శర్మకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. కీపర్గా కేఎల్ రాహుల్ను తీసుకుంది. నలుగురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే, భారీ ఆశలు పెట్టుకున్న తిలక్ వర్మ, సంజూశాంసన్కు జట్టులో చోటు కల్పంచలేదు. ఈ మేరకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందు వరల్డ్ కప్ జట్టును ప్రకటించాడు.
టీమిండియా వన్డే వరల్డ్ కప్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా