ఛాంపియన్స్ లీగ్ చివరి దశకు చేరుకుంది. లీగ్ లో జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ పై విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్ కు చేరుకున్న భారత జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా తో తలపడనుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో 2015 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోను భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో ఆ జట్టు కూడా ఓటమి తెలియకుండానే సెమీఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ భారత జట్టు బౌలింగ్ కు.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు మధ్య రసవత్తర పోరు జరగనుంది.
ఇరుజట్ల కెప్టెన్లు స్మిత్, రోహిత్ శర్మ
ఛాంపియన్స్ లీగ్ చివరి దశకు చేరుకుంది. లీగ్ లో జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ పై విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్ కు చేరుకున్న భారత జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా తో తలపడనుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో 2015 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోను భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో ఆ జట్టు కూడా ఓటమి తెలియకుండానే సెమీఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ భారత జట్టు బౌలింగ్ కు.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు విన్నర్లు అత్యంత కీలకంగా కానున్నారు. ఈ టోర్నీలో స్పిన్నర్లనే ఆయుధంగా చేసుకుని భారత జట్టు విజయాలు సాధిస్తూ వస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కొద్దిగా భారత జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. అయినప్పటికీ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత జట్టు తన సత్తాను చాటింది. నలుగురు స్పిన్నర్ లో వేసిన 39 ఓవర్లలో 128 బాల్స్ కావడంతో కివీస్ ఉక్కిరిబిక్కిరి అయింది. ప్రత్యర్థి 9 వికెట్లను ఈ నలుగురు స్పిన్నర్లే తీయడంతో పాటు 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే విజయాన్ని అందించి పెట్టారు. అందుకే ఈసారి ఆస్ట్రేలియాను దెబ్బతీసేందుకు స్పిన్ మంత్రాన్ని ప్రయోగించాలని భారత జట్టు భావిస్తోంది. వరుణ్ చక్రవర్తి వైవిధ్యమైన బౌలింగ్ తో కీలకంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నిలిచాడు. సెమీఫైనల్ లోను అతడిని కొనసాగిస్తారా లేదంటే షమీకి తోడు మరో స్పెషలిస్ట్ పేసర్ గా హర్షిత్ రానాకు, హర్షదీప్ సింగ్ ల్లో ఒకరికి అవకాశం కల్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక బ్యాటింగ్ విభాగంలో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర పటేల్, రాహుల్ రూపంలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అత్యంత ప్రతిష్టంగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝులిపిస్తున్నాడు.
ఆస్ట్రేలియా బలమంతా బ్యాటింగ్ విభాగంపైనే..
ప్యాట్ కమిన్స్, హజల్ వుడ్, స్టార్క్ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు లేకుండానే ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో బరిలోకి దిగింది. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ బలంగా ఉండడంతో ఆ జట్టు విజయాలు సాధిస్తూ వస్తోంది. స్పిన్నర్ ఆడం జంపా మాత్రమే స్టార్ బౌలర్ గా ఉన్నాడు. అందుకే ఇంగ్లాండ్ జట్టు 351, ఆఫ్ఘనిస్తాన్ జట్టు 273 పరుగులు చేయగలిగాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 352 పరుగులు లక్ష్యాన్ని 43.3 ఓవర్లలోనే ముగించి ఆ జట్టు ఆశ్చర్యానికి గురిచేసింది. టోర్నీలో ఆస్ట్రేలియా పూర్తి మ్యాచ్ ఆడింది ఈ ఒక్కసారి మాత్రమే. మిగిలిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో వీరికి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. భారత జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ నుంచి ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది. స్మితు, ఇంగ్లీష్, క్యారీ, మ్యాక్స్వెల్ రాణిస్తే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. ఈ కీలక ఆటగాళ్లు రాణిస్తే మాత్రం భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. మాథ్యూ షార్ట్ ఈ మ్యాచ్కు దూరం కావడంతో ఆడం జంపాకు జతగా మరో స్పిన్నర్ లేకుండా పోయాడు. దీంతో అతని స్థానంలో కూపర్ కొన్నోలిని తీసుకునే అవకాశం ఉంది. మ్యాక్స్వెల్, హెడ్ రూపంలో పార్ట్ టైం స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు.
ఇవి జట్లు అంచనా
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, వరుణ్ చక్రవర్తి
ఆస్ట్రేలియా జట్టు అంచనా.
హెడ్, ఇంగ్లీష్, లబు షేన్, కూపర్, క్యారీ, మ్యాక్స్వెల్, డార్విస్, ఎల్లిస్, జాన్సన్, జంపా