Bharat Ratna | ఈసారి భారత రత్న ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ.. రేసులో ప్రముఖ తెలుగు వ్యక్తి

దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఎప్పటిలానే పలువురు రాజకీయ ప్రముఖులకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారత రత్న రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

bharat ratna

భారత రత్న

దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఎప్పటిలానే పలువురు రాజకీయ ప్రముఖులకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారత రత్న రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రిపబ్లిక్‌ డే వేళ త్వరలోనే భారత రత్న పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ గట్టిగా పట్టబట్టే అవకాశం ఉంది. ఎందరికో భారతరత్న వస్తున్నా.. ఎన్టీఆర్‌కు దక్కడం లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుతున్ని. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించేందుకు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దళిత్‌ ఐకన్‌, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా ఎప్పటి నుంచో ఉంది. గతంలో చాలాసార్లు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఈ డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు.  అలాగే సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, వీర్‌ సావర్కర్‌, జ్యోతిరావ్‌ పూలే, సావిత్రీభాయ్‌ పూలే, బీహార్‌ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్‌, బీపీ మాండల్‌, ఒడిశా మాజీ సీఎం బీజూ పట్నాయక్‌ తదితరులు కూడా భారతరత్న రేసులో ఉన్నారు.

ముఖ్యంగా, భారతరత్న రేసులో ఉన్న ప్రముఖుల్లో.. దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ముందు వరుసలో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది అక్టోబర్‌ మాసంలో రతన్‌ టాటా కన్నుమూశారు. ముందు నుంచే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది. మరణానంతం ఈ డిమాండ్‌ మరింత బలపడిరది. రతన్‌ టాటాకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర కేబినెట్‌ తీర్మానం కూడా చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్