అయ్యా అమిత్ షా ఇదర్ దేఖో.. నెట్టింట్లో Population Control Bill వైరల్

కేంద్రంలోని మోదీ సర్కారు వరుసగా కీలక బిల్లులు ప్రవేశపెడుతూ, చట్టంగా మారుతున్న తరుణంలో మరో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ బిల్లు Population Control Bill తేవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

population control bill

ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న పాపులేషన్ కంట్రోల్ బిల్

న్యూఢిల్లీ, ఈవార్తలు: కేంద్రంలోని మోదీ సర్కారు వరుసగా కీలక బిల్లులు ప్రవేశపెడుతూ, చట్టంగా మారుతున్న తరుణంలో మరో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ బిల్లు Population Control Bill తేవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జాతి వ్యతిరేక శక్తులను అడ్డుకోవాలంటే పాపులేషన్ కంట్రోల్ బిల్ అవసరం చాలా ఉందని పేర్కొంటున్నారు. బిల్లులు తేవడంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. యూనిఫాం సివిల్ కోడ్, సీఏఏ, ఎన్ఆర్‌సీ చట్టాలు తీసుకొచ్చిన మోదీ సర్కారు.. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇలా.. డిమాండ్ ఒక్కసారిగా తెరపైకి రావడానికి కారణం కూడా ఉంది.

అదేందంటే.. ఓ మౌలానా మీడియాతో మాట్లాడుతూ ముస్లింల జనాభా 80 కోట్లు దాటితే ఈ హిందువులు ఒక్క మాట కూడా మాట్లాడలేరు అని వ్యాఖ్యానించారు. అంతే.. ఒక్కసారిగా జనాభా నియంత్రణ బిల్లు గురించి ట్విట్టర్‌లో డిమాండ్ మొదలైంది. భారతదేశంలో ఉండాలనుకుంటే ఏ ఒక్కరు కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకుండా బిల్లులో నిషేధం విధించాలని కేంద్ర మంత్రికి సలహాలు ఇస్తున్నారు. పనిలో పనిగా రోహింగ్యాల పని కూడా పట్టాలని కోరుతున్నారు. జనాభా నియంత్రణతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయేమో గానీ.. ఇప్పుడు ఇబ్బందులు రావొద్దంటే కచ్చితంగా జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్