ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ సంస్థ అయిన Oppo K12X 5G ను భారత్ లో లాంచ్ చేసింది. Oppo నుండి విడుదలైన ఈ ఫోన్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లుక్, డిజైన్ చాలా వరకు OnePlus Nord CE 4 లాగా ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారీ కంపెనీ ఒప్పో Oppo రూ.13 వేల లోపు ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. Oppo K సిరీస్లో మొదటి 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఫోన్ లుక్, డిజైన్ OnePlus Nord CE 4 లాగా ఉంది. Oppo ఈ ఫోన్ ఈ ధర శ్రేణిలో వస్తున్న Infinix, Tecno, Vivo, Xiaomi, Redmi వంటి బ్రాండ్ల తక్కువ ధర ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వగలదు. Oppo ఈ కొత్త 5G స్మార్ట్ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ధర:
కంపెనీ Oppo K12X 5Gని 6జిబి ర్యామ్ + 128జిబి, 8జిబి ర్యామ్ + 256జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 12,999. అదే సమయంలో, దీని టాప్ వేరియంట్ ధర రూ. 15,999. కంపెనీ ఈ ఫోన్ను బ్రీజ్ బ్లూ ,మిడ్నైట్ వైలెట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటి విక్రయం ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో ఆగస్టు 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.1,000 వరకు బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది.
ఫీచర్లు:
Oppo K12X 5G 6.67 అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్ ఫీచర్కు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 1,000 నిట్ల వరకు గరిష్ట బ్రైట్నెస్ ఫీచర్ సపోర్టు చేస్తుంది. ఫోన్ డిస్ప్లే డ్యూయల్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్పై రన్ అవుతుంది. ఫోన్లో గరిష్టంగా 8GB వరకు LPDDR4X RAM, 256GB UFS 2.2 ఆన్బోర్డ్ స్టోరేజీ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజీని ఎక్స్ పాండ్ చేసుకోవచచు.
Oppo యొక్క ఈ ఫోన్ 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనితో, 45W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్ఓఎస్లో ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనుక భాగంలో 32MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం స్పెషల్ కెమెరా ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ కూడా ఉంది.