రుషికొండ నిర్మాణంపై వైసీపీ కీలక ప్రకటన.. ప్రభుత్వ భవనమే అంటూ వెల్లడి

రుషికొండపై నిర్మించిన భవనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బయటకు విడుదల చేశారు. పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లి మరీ అక్కడున్న నిర్మాణాలను బయట ప్రపంచానికి తెలియజేశారు. జగన్మోహన్‌ రెడ్డి ఇష్టంగా, గుట్టుగా కట్టుకున్న ప్యాలెస్‌ ఇదేనంటూ టీడీపీ విమర్శలు చేస్తుండగా, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ వస్తున్నాయి.

rushikonda

రుషికొండ


రుషికొండపై నిర్మించిన భవనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బయటకు విడుదల చేశారు. పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లి మరీ అక్కడున్న నిర్మాణాలను బయట ప్రపంచానికి తెలియజేశారు. జగన్మోహన్‌ రెడ్డి ఇష్టంగా, గుట్టుగా కట్టుకున్న ప్యాలెస్‌ ఇదేనంటూ టీడీపీ విమర్శలు చేస్తుండగా, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ వస్తున్నాయి. దీనిపై వైసీపీ స్పందించింది. వైసీపీ అధికారిక ఎక్స్‌ పేజిలో ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. రుషికొండలో ఉన్నవి అన్నీ ప్రభుత్వ భవనాలేనని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటూ వెల్లడించింది. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని, అవి ఎవరి సొంతం కూడా కదన్నారు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారని, వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ఈ ప్రభుత్వం ఇష్టమని వైసీపీ పేర్కొంది. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్ధేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొంది. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతున్నారని, ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడని, విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌ లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగానీ, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని’ వైసీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. 



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్