ఢిల్లీ ధర్నా వెనుక వైయస్ జగన్ ప్లాన్ ఏమిటి..! జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేయడమే లక్ష్యమా.?

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలు, రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 24న ఢిల్లీ వేదికగా ధర్నాకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే గవర్నర్ నజీర్ ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గడిచిన 45 రోజులుగా జరిగిన దాడులు, హింసకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను గవర్నర్ కు అందించారు. మరోవైపు బుధవారం ఢిల్లీ వేదికగా ధర్నాకు ఆయన సిద్ధపడుతున్నారు.

YS Jaganmohan Reddy

వైయస్ జగన్మోహన్ రెడ్డి 

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలు, రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 24న ఢిల్లీ వేదికగా ధర్నాకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే గవర్నర్ నజీర్ ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గడిచిన 45 రోజులుగా జరిగిన దాడులు, హింసకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను గవర్నర్ కు అందించారు. మరోవైపు బుధవారం ఢిల్లీ వేదికగా ధర్నాకు ఆయన సిద్ధపడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు పూర్తికాకముందే జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిస్థాయిలో యాక్టివ్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దాడులకు గురైన బాధితులను పరామర్శించిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండ రాజకీయాలపై  జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేయాలన్న ఉద్దేశంతో జగన్ ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆఘాయిత్యాలను జాతీయస్థాయిలో వివిధ పార్టీల నాయకులకు తెలియజేయడంతోపాటు మీడియా ద్వారా దేశమంతటా దీనిపై చర్చ జరిగేలా చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన మీడియా కూటమికి అనుకూలంగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి చేసే పోరాటాలను ప్రజలకు తెలియజేసేలా చేయకపోవడం వంటి కారణాలు కూడా ఆయన ఢిల్లీని కేంద్రంగా ఎంచుకొని ధర్నాకు సిద్ధపడేలా చేశాయని చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టనున్న ఈ దీక్ష ద్వారా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా వైసిపి ఉందన్న విషయాన్ని జాతి స్థాయిలో తెలియజేయడంతోపాటు ఇకపై తాను ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేయబోతున్న విషయాన్ని ఈ ప్రకటన ద్వారా చెప్పకనే చెబుతున్నారు. ఈ దీక్షకు కలిసి వచ్చే పార్టీలను తీసుకురావాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు సూచించారు. భవిష్యత్తులో జాతీయస్థాయిలో ముఖ్యమైన పార్టీలతో సత్సంబంధాలను నెలకొల్పడం కీలకమైన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీతో ప్రత్యేకంగా ఆయన సంబంధాలను ఇకపై నేరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సుమారు 15 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు ఢిల్లీ స్థాయిలో రాజకీయాల పట్ల ఆసక్తి చూపించలేదు. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోను సత్సంబంధాలను నేరిపే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ దీక్షకు ముఖ్యమైన పార్టీలకు చెందిన నాయకులు వచ్చేలా చేయడం ద్వారా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కీలక పార్టీలతో పెద్దగా సత్సంబంధాలు లేవు. గడచిన కొన్నాళ్లుగా బీజేపీతోనే సన్నిహితంగా వైసిపి ఉంటూ వస్తుంది. రాష్ట్రంలో బిజెపి టిడిపితో దోస్తీ కట్టింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీని స్నేహపూర్వకంగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి చెందిన నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలను నెరపడం లేదు. ఇది కూడా కొంత ఇబ్బందికర అంశంగా జగన్మోహన్ రెడ్డికి పరిణమిస్తోంది. ఢిల్లీ దీక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి జాతీయస్థాయిలో తన రాజకీయ ఆలోచనను మార్చుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్