రాష్ట్రంలో గడిచిన 50 రోజులు నుంచి జరుగుతున్న దాడులు, హత్యలు, అఘాయిత్యాల చిట్టాను ఢిల్లీలో విప్పుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం నష్టపోతుందని ఒక మంత్రి చెబుతున్నారని, ఆయన రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది ప్రజలు కాదని, తెలుగుదేశం పార్టీ అన్నారు. మూడు నెలలు వరకు మాట్లాడకూడదని తాము భావించామని, అయితే టీడీపీయే రోడ్డు మీదకు వచ్చేలా చేస్తోందన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు
రాష్ట్రంలో గడిచిన 50 రోజులు నుంచి జరుగుతున్న దాడులు, హత్యలు, అఘాయిత్యాల చిట్టాను ఢిల్లీలో విప్పుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం నష్టపోతుందని ఒక మంత్రి చెబుతున్నారని, ఆయన రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది ప్రజలు కాదని, తెలుగుదేశం పార్టీ అన్నారు. మూడు నెలలు వరకు మాట్లాడకూడదని తాము భావించామని, అయితే టీడీపీయే రోడ్డు మీదకు వచ్చేలా చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను, హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని రోడ్డు మీదకు వచ్చి ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రభంజనం అన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. పథకాలు విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిన దానిపై మాత్రం ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. పిల్లలు స్కూల్కు వెళుతున్నారని, వారికి ఇప్పటికీ తల్లికి వందనం పథకాన్ని అందించలేదన్నారు. ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందన్న విషయాన్ని నెలన్నర రోజుల్లోనే అర్థమైపోయిందన్నారు. అక్రమాలు చేయడం, కార్యకర్తలను హత్య చేయడం, కేసులు పెట్టడంపైనే దృష్టి సారించారన్నారు. పార్టీ నాయకులందరిపైనా 307 కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 307 సెక్షన్ను మిస్ యూజ్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జైలులో ఉంటామని, దానికి భయపడే ప్రసక్తే లేదన్నారు.
హోంమంత్రి అనిత జగన్మోహన్రెడ్డిని ఏకవచనంతో సంభోదిస్తున్నారని, ప్రజల మనిషి అన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. మూడు పార్టీలు కలిస్తే 53 శాతం ఓట్లు వచ్చాయని, తమ పార్టీ ఒక్క దానికే 40 శాతం వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. నలుగురు కలిసి వచ్చి ఏదో మాట్లాడుతున్నారని, వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. మాజీ హోం మంత్రి, మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా మాజీ సీఎం కూడా అవుతారన్న విషయాన్ని గుర్తించుకోవాలన హితవు పలికారు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలో రాష్ట్రంలో జరిగిన దాడులు విషయాలన్నింటినీ బయట పెడతామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రెడ్బుక్లో రాసుకుంటున్న అని చెప్పిన లోకేశ్.. ఇప్పుడు వాటినే అమలు చేస్తున్నారన్నారు. బట్టలూడదీసి నడిబజారులో నడిపించే బాధ్యత తీసుకుంటానని లోకేశ్ చెప్పాడని, ఇప్పుడు దాన్నే అమలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తామేం చేసినా పోలీసులు ఏమీ చేయరన్న కాన్ఫిడెన్స్ను టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు, హోంమంత్రి ఇచ్చారని, ఆ కాన్ఫిడెన్స్ను తొలగించకపోతే నాశనం అవుతారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.