నేడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కేంద్ర మంత్రులతోను సమావేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కలవనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతోపాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో పాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

CM Revanth Reddy with Rahul Gandhi

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కలవనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతోపాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో పాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించి పెట్టుబడుల గురించి పలు కంపెనీలతో, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరిగిన ఒప్పందాలు, వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను అధిష్టానానికి నివేదించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో కూడా దీన్ని పొందుపరిచారు. ఈ హామీని అమలు చేసినందున వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సభకు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి కలిసి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు హామీల హామీలు తీరు వంటి కీలక అంశాలను పార్టీ అధినాయకత్వం దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లను ఉన్నారు. 

కీలక పదవుల భర్తీ.. అగ్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా 

పిసిసి అధ్యక్షుడుగాను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోందే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. తాజా సమావేశంలో పిసిసి అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన చర్చ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకుల్లో ఒకరిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. ఈ జాబితాలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు అధిష్టానం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. ఈ భేటీలో పిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంత్రివర్గ విస్తరణ, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి పదవులు విషయంలోనూ సామాజిక సమతూకం పాటించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డికి కీలక సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్, సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, మధున్మోహన్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. తాను పార్టీలో చేరేటప్పుడే తనకు హామీ ఇచ్చారని రాజ గోపాల్ రెడ్డి చెబుతుండగా, ముదురాజుల నుంచి శ్రీహరి పేరును ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, వర్గాలకు విస్తరణలో అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లను కూడా పరిగణలో తీసుకొని ఏడు, ఎనిమిది పదవులకు వివిధ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ అధిష్టానాన్ని కలిసి విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను చెప్పడంతోపాటు ఈ నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్