రాష్ట్రంలోని ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలోని ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ’మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ను ఒకేసారి వేయి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలు ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్లు భారం పడనుందన్నారు. గత అధికార పక్షం పింఛన్దారులను ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో మూడు నెలలు పింఛన్దారులు కష్టాలు చూసి చలించిపోయానని, మండుటెండలో, వడగాడ్పుల మధ్య పడిన అగచాట్లు చూశానని పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంచిన పింఛన్ను వర్తింపజేసి అందిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.