|| తెలంగాణ సచివాలయం || తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి తేది ఖరారు అయింది. ఈ భవనాన్ని ఫిబ్రవరి 17న (శుక్రవారం) ఉదయం 11.30 నుంచి 12.30 గంటల ముహూర్తన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, తదితర ముఖ్యులు పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ జరుగుతుంది. ఈ బహిరంగసభలో సచివాలయ ప్రారంభోత్సవానికి పాల్గొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొననున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.