ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు తనతో పాటు లాయర్ను అనుమతించాలన్న అభ్యర్థనకు హైకోర్టు.. ఓకే చెప్పింది.
తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, ఈవార్తలు : ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు తనతో పాటు లాయర్ను అనుమతించాలన్న అభ్యర్థనకు హైకోర్టు.. ఓకే చెప్పింది. అయితే.. విచారణను చూడటానికి మాత్రమే న్యాయవాదికి అనుమతి ఇస్తామని, కేటీఆర్తో పాటు విచారణలో పాల్గొనడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఏసీబీ విచారణకు లాయర్ను అనుమతించాలని కేటీఆర్ తరఫు లాయర్ కోరారు. న్యాయవాది రామచందర్రావుకు విచారణ కోసం అనుమతి ఇవ్వాలని విన్నవించారు. అయితే.. న్యాయవాది కూర్చోవడానికి లైబ్రరీలో సౌకర్యంగా ఉంటుందని కోర్టుకు ఏఏజీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. విచారణను వినేందుకు న్యాయవాదికి అనుమతి ఇస్తామని తెలిపింది. రేపు ఏసీబీ విచారణకు హాజరుకావాలని సూచించింది. విచారణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే హైకోర్టును సంప్రదించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కేటీఆర్పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయని బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పైనా ఫిర్యాదుచేశారు.