నేడే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ.. తెలంగాణ డిమాండ్స్ ఇవే..

Revanth Chandrababu Meeting : తెలంగాణ డిమాండ్స్‌పై ఓ స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఆ డిమాండ్లనే సీఎంల భేటీ సందర్భంగా లేవనెత్తనున్నారు.

telugu cm meeting

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు: తెలుగు రాష్ట్రాలు విడిపోయిన పదేళ్లు పూర్తయినా పలు విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపగా, భేటీకి సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో నేడు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో వీరిద్దరు భేటీ అయ్యి విభజన సమస్యలపై చర్చించనున్నారు. తెలంగాణ డిమాండ్స్ ఏంటి? ఏపీ డిమాండ్స్ ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డిమాండ్స్‌పై ఓ స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఆ డిమాండ్లనే సీఎంల భేటీ సందర్భంగా లేవనెత్తనున్నారు.

తెలంగాణ డిమాండ్స్ ఇవే..

- తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ ప్రభుత్వం రూ.24 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి.

- ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలి.

- తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల ఏపీ తీరప్రాంతంలో తెలంగాణకు వాటా కల్పించాలి. విభజన చట్టంలో కేటాయించిన కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరంలో భాగం కావాలి.

- తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ తెలంగాణకు భాగం కావాలి.

- కృష్ణా జలాల్లో తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలి.




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్