తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం పచ్చ జెండా ఊపింది. ఉగాది సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం పచ్చ జెండా ఊపింది. ఉగాది సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 4 మంత్రి పదవులక భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకూ కాంగ్రెస్ అధిష్ఠానం ఓకే చెప్పింది. ఈ మేరకు కాసేపటి క్రితమే పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రభుత్వ పథకాల పనితీరును వారికి రేవంత్ వివరించారు. ఈ భేటీలో రాష్ట్రం నుంచి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.