పార్లమెంట్ సాక్షిగా వైసిపి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాకై గళం ఎత్తారు. మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైయస్సార్సీపి పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
పార్లమెంట్ సాక్షిగా వైసిపి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాకై గళం ఎత్తారు. మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైయస్సార్సీపి పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇది డిమాండ్ మాత్రమే కాదని, ఏపీ ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే అవకాశం ఇప్పుడు టిడిపికి ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామి పార్టీగా ఉందని, కాబట్టి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టిడిపి అడగాలన్నారు. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపైనా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచిందని అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిస్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి..
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలన్నారు. ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ స్థాపించారని, తక్కువ ఖర్చుతో డాక్టర్లు తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పధకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయాలని గ్లోబల్ వార్నింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగిన భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రైల్వేలో ప్రయాణికుల భద్రతకు నిధులు పెంచాలని, రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రతా చర్యలను వెంటనే అప్ గ్రేడ్ చేయాలన్నారు. రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించిందని, నడికుడి - శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలని, విశాఖపట్టణం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని కోరారు.