స్పందన.. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్

ప్రజా సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వం స్పందన పేరుతో అమలు చేసిన కార్యక్రమ పేరును తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేవారు. స్పందన పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు.

స్పందన

స్పందన


ప్రజా సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వం స్పందన పేరుతో అమలు చేసిన కార్యక్రమ పేరును తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేవారు. స్పందన పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి నేతృత్వంలోని కూటమి.. స్పందన పేరును మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రెస్సెల్ సిస్టమ్ గా పేరు మార్పు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయనున్నారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా విభాగాలు ఆయా శాఖలకు చెందిన అధికారులు ఉంటూ వచ్చిన సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించడం లేదా వాటిని వేగంగా పరిష్కరించేలా చేస్తున్నారు. వారానికి ఒకరోజు జిల్లా యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పైన దృష్టి సారిస్తూ వస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్