మదనపల్లె ఘటనపై స్పందించిన డీజీపీ.. భారీ కుట్ర ఉందంటూ వ్యాఖ్య

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం ఘటన జరిగిన కార్యాలయాన్ని సందర్శించి కీలక అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

DGP Dwaraka Tirumala Rao

డీజీపీ ద్వారకా తిరుమలరావు

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం ఘటన జరిగిన కార్యాలయాన్ని సందర్శించి కీలక అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా ఆయన అభివర్ణించారు. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలు సమయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు వెల్లడించారు. ఈ ఘటనను తాము మూడు గంటలకు పరిశీలించామని, ప్రాథమిక అంచనా ప్రకారం యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా భావించామన్నారు. వివాదాస్పద 22ఏ భూములు రికార్డులు ఉన్న గదిలోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు డీజీపీ వెల్లడించారు. ప్రాధాన్యం కలిగిన పత్రాలు ఉన్న గదిలోనే అగ్ని ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మొదట ఆర్డీవోకు తెలిసిందని, కానీ ఆయన కలెక్టర్‌కు వెంటనే సమాచారం ఇవ్వకుండా మౌనందాల్చారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న సీఐ కూడా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయలేదని, ఈ విషయాలను తాము గుర్తించినట్టు తెలిపారు. ఈ అంశాలు అనేక అనుమానాలకు తావు తీస్తున్నాయన్నారు. కావాలనే ఎవరైనా ఈ చర్యకు ప్పాలడ్డారా..? లేదా..? అన్న దానిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. 

ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం ఉన్నట్టు కనిపిస్తోందని డీజీపీ వివరించారు. ఘటనకు కారణంగా షార్ట్‌ సర్క్యూట్‌ అని చెబుతున్నారని, అందుకు ఆస్కారమే లేదన్న విషయాన్ని తాము గుర్తించినట్టు తెలిపారు. ఈ ప్రదేశంలో ఎక్కడా హై ఓల్టేజీలో తేడాలు కూడా లేవన్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ వాళ్లు కూడా చెప్పినట్టు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన సబ్‌ కలెక్టరేట్‌ ఆఫీసు కిటికీ వద్ద అగ్గి పుల్లలను కూడా గుర్తించినట్టు తెలిపారు. ఆఫీసు బయట కూడా కొన్ని ఫైల్స్‌ కాలిపోయినట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్ష్యాలను ధ్వంసం చేసే ఘటనలు జరిగాయని, ఆ కోణంలోనే దర్యాప్తు సాగిస్తున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తును పది బృందాలను నియమించామని, ఈ కేసును సీఐడీకి కూడా బదిలీ చేసే అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు డీజీపీ వివరించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్