కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రాహుల్ గాంధీ Photo: twitter||

ఈవార్తలు, నేషనల్ న్యూస్: ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిందో కోర్టు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలు’ అని వ్యాఖ్యానించారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అలా అనలేదని కోర్టుకు రాహుల్ వివరణ ఇచ్చారు. కానీ,  కోర్టు ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం ఆయనను దోషిగా తేల్చింది. రెండేళ్ల శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది. ఆ వెంటనే రాహుల్‌ గాంధీకి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకొనే అవకాశం కల్పించింది. తీర్పు ఇచ్చే సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. 

కోర్టు తీర్పు తర్వాత రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సత్యం, అహింసపైనే నా ధర్మం ఆధారపడి ఉంది. సత్యం నా భగవంతుడు. ఆయన్ని చేరుకోవడానికి కావాల్సిన సాధనమే అహింస’ అని మహాత్మాగాంధీ వ్యాఖ్యలను కోట్ చేశారు. రాహుల్ సోదరి ప్రియాకం గాంధీ కూడా స్పందించారు. ‘నా సోదరుడు ఎప్పుడూ భయపడలేదు. భవిష్యత్తులో భయపడడు కూడా’ స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్