దేశంలో నూతనంగా కొలువుదీరిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు రోజు ఆర్థిక సర్వేను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం విశ్లేషణలతోపాటు ఉపాధి, జిడిపి, బడ్జెట్ లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్యంగా ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది.
పార్లమెంట్ సమావేశాలు
దేశంలో నూతనంగా కొలువుదీరిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు రోజు ఆర్థిక సర్వేను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం విశ్లేషణలతోపాటు ఉపాధి, జిడిపి, బడ్జెట్ లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్యంగా ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది. మరోవైపు నీట్ ప్రశ్నాపత్రం లీకైన కేసు, రైల్వే భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాల్లో 96 ఏళ్ళ నాటి పౌర విమానయాన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్ము కాశ్మీర్ బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీలు ఏ ఏ అంశాలు లేవనత్తాలనుకుంటున్నాయో తెలుసుకునేందుకు ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తక్కువగా ఉండేలా బ్యాంకింగ్ చట్టాలకు ప్రభుత్వం ఈ సమావేశాల్లో సవరణ తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే చర్యలను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ స్పష్టం చేశారు. విపత్తుల నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ బిల్లు, రబ్బర్ బిల్లులను కూడా ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టనున్నారు. సభాధ్యక్షుడు ఇచ్చే రూలింగ్ ను ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని, సభలోగానీ, బయటగానీ విమర్శించకూడదని పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఎంపీలకు స్పష్టం చేశారు. అలాగే సభలో వందేమాతరం, జైహింద్ సహా నినాదాలు ఏమి చేయకూడదని తేల్చి చెప్పారు. సభలో ప్లకార్డులు తదితరాలను ప్రదర్శించడం పద్ధతి కాదు అంటూ పార్లమెంటరీ ఆచారాలు, సాంప్రదాయాలు, ఎథిక్స్ పై సభ్యులు దృష్టిపెట్టేందుకు అనుగుణంగా రాజ్యసభ.. రాజ్యసభ సభ్యుల కోసం హ్యాండ్ బుక్ ను రాజ్యసభ సెక్రటేరియట్ తీసుకొచ్చింది. ఈ నెల 15న జారీ చేసిన రాజ్యసభ హ్యాండ్ బుక్ లో ఈ అంశాలను ప్రచురించారు. సభా కార్యకలాపాలను హుందాగా, గంభీరంగా నిర్వర్తించేందుకు థాంక్స్, థాంక్యూ, జై హింద్, వందేమాతరం తదితర నినాదాలు ఏవీ సభలో చేయకూడదని బులిటెన్ స్పష్టం చేశారు. సభ పూర్వాపరాలను అనుసరించి సభాపతి రూలింగ్ ఇస్తారని, పూర్వాపరాలు లేని చోట్ల సాధారణ పార్లమెంటరీ పద్ధతిని అనుసరిస్తారని తెలిపారు. దూషణలు, అభ్యంతరకరమైన అన్ పార్లమెంటరీ పదాలు లేదా వ్యక్తి దూషణలు ఖచ్చితంగా నివారించాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ విడుదల చేసిన బులిటెన్ లో ప్రస్తావించింది.