ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి పంపిణీ చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి పంపిణీ చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ ఆదేశాలు జారీ చేశామని, వృద్ధులకు నాలుగు వేలు, దివ్యాంగులకు రూ.6 వేల రూపాయలు పెన్షన్ అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పెన్షన్లను ఇంటి వద్ద అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పెన్షన్లను గ్రామ సచివాల సిబ్బంది వాలంటీర్ల ద్వారానే లబ్ధిదారుల ఇళ్ల దగ్గర అందజేస్తారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా కీలకమైన హామీల అమలుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు సంతకాలు చేసినట్లు ఆయన వివరించారు. గతంలో మాదిరిగా తమ మంత్రులు ప్రెస్ మీట్ లో బూతులు, తిట్లు మాట్లాడరన్నారు. జగన్ పాలన మొత్తం తిట్లు, బూతులు, విద్వేషం, విధ్వంసం, కేసులతో నడిచిందని, ఎన్డీఏ పాలన అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలతో కూడి ఉంటుందన్నారు. తమ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమకు అదే విషయాన్ని చెప్పారని, తాము బూతులు తిట్టమని రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఆందోళన చెందిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతకాన్ని చేశారన్నారు. అన్నా క్యాంటీన్లను కూడా పునరుద్ధరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు నాణ్యమైన వేతనాలు పొందేలా చేస్తామని, అందుకు అనుగుణంగానే నైపుణ్యం గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.