గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్.. నవంబర్ లో కీలక ప్రోగ్రామ్స్ అమలుకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే సైన్స్ ఫెయిర్, క్రీడా పోటీలను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన కిట్లను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Minister Nara Lokesh

మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే సైన్స్ ఫెయిర్, క్రీడా పోటీలను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన కిట్లను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఏ స్థాయిలో అయినా ప్రశ్నాపత్రాలు లీక్ అయినా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోందన్న మంత్రి లోకేష్.. స్కూళ్లలో ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అనకాపల్లి అనాధాశ్రమంలో కలుషిత ఆహారం తీసుకుని ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, సుమారు 42 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం తనిఖీలను చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

యువత నైపుణ్య గణన చేపట్టేందుకు ఏర్పాట్లు 

యువతలో నైపుణ్యాలను గుర్తించేందుకు నైపుణ్య గణన ప్రక్రియను చేపట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. పరిశ్రమల యజమానులు, జాబ్ పోర్టల్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు  ఈ నైపుణ్య గణన పూర్తి చేసిన తర్వాత యువతకు నైపుణ్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్వే ద్వారా వివరాలతో యువత విద్యార్హతలు, ఉపాధి నైపుణ్యాలను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత సమాచారాన్ని ప్రముఖ కంపెనీలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. అప్పుడు ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. నైపుణ గణన ప్రక్రియను మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. స్కిల్ సెన్సెస్ సర్వేతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్ నిర్వాహకులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నైపుణ్య గణన చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు అధికారులు సహకారాన్ని అందించాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్