మళ్లీ జైలుకు వెళ్లిన కేజ్రీవాల్.. బెయిల్ గడువు ముగియడంతోనే

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మళ్లీ తీహాడ్ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Kejriwal

కేజ్రీవాల్


సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మళ్లీ తీహాడ్ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత భార్య సునీత కేజ్రీవాల్ ఆప్ నేతలు అతిష్, సౌరబ్ భరద్వాజ్, కైలాస్ గహలోత్ సహా ఇతర ముఖ్య నేతలతో కలిసి రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కన్నౌట్ ప్లేస్ లోని హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించారు. ఉదయం ఢిల్లీ ఆఫ్ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. 21 రోజుల్లో ఒక సెకను కూడా వృధా చేయలేదన్నారు. ఆమ్ ఆద్మీ కోసమే కాకుండా అనేక పార్టీల కోసం ప్రచారం చేశానని గుర్తు చేశారు. జైలు నుంచి మళ్లీ ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు అన్న కేజ్రీవాల్.. జూన్ ఐదో తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఎలా ఉంటే కేజ్రీవాల్ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ తోపాటు అనేక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. ప్రధాని మోడీ లక్ష్యంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు కేజ్రీవాల్ కు అత్యంత ప్రతిష్టాత్మకం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్