ఏపీలో మరో కీలక పథకం అమలు.. దీపావళి పండగకు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్

మరో కీలక హామీని దీపావళి పండుగ నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీచేసినట్లు చెబుతున్నారు. అదే ఉచిత గ్యాస్ సిలిండర్ కంపెనీ పథకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల హామీల్లోనూ దీనిని చేర్చారు.

CM Chandrababu Naidu

సీఎం చంద్రబాబు నాయుడు

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో కూటమి నాయకులు సూపర్ సిక్స్ పేరుతో పలు కీలక హామీలను ఇచ్చారు. ఆయా హామీలను వరసగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, డీఎస్సీ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మరో కీలక హామీని దీపావళి పండుగ నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీచేసినట్లు చెబుతున్నారు. అదే ఉచిత గ్యాస్ సిలిండర్ కంపెనీ పథకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల హామీల్లోనూ దీనిని చేర్చారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు పౌరసరఫరాల శాఖ మంత్రి, ఆయిల్ కార్పొరేషన్ సమీక్ష సమావేశాన్ని కూడా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీపావళి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని, మహిళలకు ఇది మరింత సౌలభ్యం కలిగిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

అక్టోబర్ 31వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మొదలు కానుంది. అయితే అక్టోబర్ 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. వంట గ్యాస్ సబ్సిడీ రెండు రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,684 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఐదేళ్ల కు మొత్తం రూ.13,423 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 876 రూపాయలు ఉన్నట్లు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా కేంద్ర ప్రభుత్వం 25 రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మొత్తాన్ని ధరించి ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ను అందించనుంది. తొలి విడత మొదటి సిలిండర్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా మరో రెండు విడతల్లో మిగిలిన రెండు గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందించనున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం మరో కీలక హామీ అమలు చేసేందుకు సిద్ధమవుతుండడంతో మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పండగ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా పండగను మరింత ఆనందంగా జరుపుకునేలా ప్రభుత్వం చేస్తున్నందుకు పలువురు మహిళలు మురిసిపోతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్