ఏపీలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది. అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గత కొన్నాళ్లుగా అభ్యర్థులు ఈ మేరకు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రం అందిస్తూ వస్తున్నారు.
మెగా డీఎస్సీ
ఏపీలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది. అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గత కొన్నాళ్లుగా అభ్యర్థులు ఈ మేరకు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రం అందిస్తూ వస్తున్నారు. త్వరలోనే టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,437 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో అవకాశాన్ని కల్పించనున్నారు.
డీస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం కావాలని విద్యార్థులు మంత్రి నారా లోకేష్తోపాటు ఇతర మంత్రులను కలిసి వినతిపత్రాలను సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా స్పందించింది. ప్రిపరేషన్కు సమయం ఇస్తే బాగుంటుందని మంత్రి నారా లోకేష్ భావించారు. అందుకు అనుగుణంగానే విద్యాశాఖ అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. టెట్కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.