గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌.. కారణం అదేనా..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తాజాగా ఆయన గన్నవరం వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరానికి దగ్గరలో ఉండగా పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌ నుంచి వేర్వేరు కార్లలో ఆయన ప్రయాణిస్తూ గన్నవరం చేరుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను ట్రాక్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు.

Former MLA Vallabhaneni Vamsi

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తాజాగా ఆయన గన్నవరం వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరానికి దగ్గరలో ఉండగా పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌ నుంచి వేర్వేరు కార్లలో ఆయన ప్రయాణిస్తూ గన్నవరం చేరుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను ట్రాక్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీయే దాడికి ప్రోత్సహించినట్టు పలువురు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం మేరకు అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వంశీని ఏ1గా చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ అరెస్ట్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

ఇదిలా, ఉంటే ఎన్నికల ఫలితాలు రోజు వల్లభనేని వంశీ ఇంటిపై దాడికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. వందలాది మంది ఆయన ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ తరువాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కొందరు హైదరాబాద్‌లో ఉన్నారని చెబుతుండగా, అమెరికాలో వెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, రెండు నెలలు తరువాత గన్నవరం వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. ఇదిలా ఉంటే వంశీ అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించడం లేదు. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీని వెంటనే కోర్టులో హాజరుపర్చాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు లాయర్లు కూడా డిమాండ్‌ చేసే అవకాశముంది. ఇప్పటికే లాయర్లు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్