రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు

దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. యూపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Candidates going for exams

పరీక్షలకు వెళ్తున్న అభ్యర్థులు


దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. యూపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాలు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్