ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధితులు స్వీకరించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పలు ఫైళ్లపై సంతకాలు చేశారు.
బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధితులు స్వీకరించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ విడుదల చేసేందుకు అనుగుణంగా పెట్టగా, రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు, మూడో సంతకాన్ని నాలుగు వేలకు పెన్షన్లను పెంచుతూ చేశారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నాలుగు సంతకాన్ని చేయగా, ఐదో సంతకాన్ని నైపుణ్య గణనకు సంబంధించి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించని సమయంలో మంత్రులు అచ్చం నాయుడుతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను కొద్దిరోజుల్లోనే పరిష్కరించే అవకాశం ఉందన్న భావనను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.