370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వేల మంది అమరులు కావటానికి కారణం కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా గన్ పార్కు అమరుల స్థూపం ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అని ప్రశ్నించారు.

ktr gun park

కేటీఆర్, అమరవీరుల స్థూపం

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వేల మంది అమరులు కావటానికి కారణం కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా గన్ పార్కు అమరుల స్థూపం ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు?.. కాంగ్రెస్ ప్రభుత్వం

1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు? .. కాంగ్రెస్ ప్రభుత్వం

దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు?.. కాంగ్రెస్ ప్రభుత్వం

2004లో  మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు?.. కాంగ్రెస్ ప్రభుత్వం

రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరు?.. కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్