||బీఆర్ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెండ్||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : కొద్ది రోజులుగా బీఆర్ఎస్కు, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నిన్న కొత్తగూడెంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్పై విమర్శలు చేయటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిబంధనలను వారిద్దరు ఉల్లంఘించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.