మూడు రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.

kcr telangana

కేసీఆర్

ఈవార్తలు, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ సూచనల మేరకు ముగింపు వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

జూన్ 1: సాయంత్రం 7 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు అర్పించిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘననివాళి అర్పిస్తారు.

జూన్ 2: (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున) దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తారు. అదే రోజు హైదరాబాద్‌లోని పలు దవాఖానల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు స్వీట్లు పంపిణీ చేస్తారు.

జూన్ 3: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండా, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానలు, అనాథా శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్