నాగబాబు, నాగుపాము ఇద్దరూ ఒకటే : వైసీపీ నాయకుడు పోతిన మహేష్

జనసేన ముఖ్య నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుపై మాజీ జనసేన నాయకుడు, ప్రస్తుత వైసీపీ లీడర్ పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

వైసీపీ నాయకుడు పోతిన మహేష్
వైసీపీ నాయకుడు పోతిన మహేష్


జనసేన ముఖ్య నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుపై మాజీ జనసేన నాయకుడు, ప్రస్తుత వైసీపీ లీడర్ పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. నాగబాబు చేసిన ఈ ట్వీట్ పై ఇప్పటికే పెద్ద రచ్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకుడు పోతిన మహేష్ నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగుపాముకి పాలు పోసిన అది కాటు వేస్తుందని, నాగబాబు కూడా అలాంటి వాడే అని పోతిన మహేష్ విమర్శించారు. వాడుకుని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ అసలు తెలుస్తుందా..? అంటూ చురకలు అంటించారు. సహాయం చేసిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో మెగా కుటుంబం ఉండదని మహేష్ ఆరోపించారు. నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ ఎంతగానో సహకారాన్ని అందించారని, నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి మూడు కోట్ల రూపాయలు ఇప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో రెండు, మూడు సినిమాల్లో అవకాశాలు కూడా నాగబాబుకు అల్లు అర్జున్ ఇప్పించిన విషయాన్ని మహేష్ గుర్తు చేశారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ జనసేనకు రెండు కోట్ల రూపాయలు నిధులు కూడా అందించాడని, అయినప్పటికీ అల్లు అర్జున్ పై నాగబాబు విషం చిమ్మడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మెగా కుటుంబానికి అండగా నిలిచిన గీత ఆర్ట్స్ పైనే నాగబాబు తన కుళ్ళు, కుతంత్రాలను వ్యక్తం చేయడం దారుణం అన్నారు. మెగా ఫ్యామిలీ ఒక దగా ఫ్యామిలీ అని పోతిన మహేష్ విరుచుకుపడ్డారు. మరోవైపు అల్లు అర్జున్ పై నాగబాబు చేసిన ట్వీట్ పై ఆయన అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగబాబుకు మంచి, మర్యాద తెలియదంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఆ ట్వీట్ ను తొలగించినప్పటికీ రచ్చ మాత్రం కొనసాగుతోంది. ఏది ఏమైనా రాజకీయాల కేంద్రంగా జరుగుతున్న రచ్చ మెగా ఫ్యామిలీను బజారుకీడ్చినట్టు అయిందని పలువురు వాపోతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్