తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఎవరెవరికి టికెట్లు దక్కాయంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఎవరెవరికి టికెట్లు దక్కాయంటే..||

గత రెండు మూడు రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 52 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తారు. గజ్వేల్, హుజూరాబాద్ రెండు నియోజకవర్గాల నుంచి ఈటల రాజేందర్‌కు పార్టీ అవకాశం కల్పించింది.

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు వీళ్లే..

సిర్పూర్‌ - పాల్వాయి హరీశ్‌‌బాబు, బెల్లంపల్లి(ఎస్సీ)-అమరాజుల శ్రీదేవి, ఖానాపూర్‌(ఎస్టీ)-రమేశ్‌ రాథోడ్‌, ఆదిలాబాద్‌-పాయల్‌ శంకర్‌, బోథ్‌(ఎస్టీ)-సోయం బాపూరావు, నిర్మల్‌-ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి, ముథోల్‌-రామారావు పటేల్‌, ఆర్మూరు-పైడి రాకేశ్‌‌రెడ్డి, జుక్కల్‌(ఎస్సీ)-అరుణ తార, కామారెడ్డి-వెంకటరమణారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌-సూర్యనారాయణగుప్తా, బాల్కొండ-ఆలేటి అన్నపూర్ణమ్మ, కోరుట్ల-ధర్మపురి అర్వింద్‌, జగిత్యాల-బోగ శ్రావణి, ధర్మపురి-కుమార్‌, రామగుండం-కందుల సంధ్యారాణి, కరీంనగర్‌-బండి సంజయ్‌, చొప్పదండి(ఎస్సీ)-బొడిగె శోభ, సిరిసిల్ల-రాణి రుద్రమరెడ్డి, మానకొండూరు(ఎస్సీ)-ఆరెపల్లి మోహన్‌, హుజురాబాద్‌-ఈటల రాజేందర్‌, నర్సాపూర్‌-మురళీయాదవ్‌, పటాన్‌చెరు-నందీశ్వర్‌‌గౌడ్‌, దుబ్బాక-రఘునందన్‌‌రావు, గజ్వేల్‌-ఈటల రాజేందర్‌, కుత్బుల్లాపూర్‌-కూన శ్రీశైలంగౌడ్‌, ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్‌గౌడ్‌, మహేశ్వరం-అందెల శ్రీరాములుయాదవ్‌, ఖైరతాబాద్‌-చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్‌-అమర్‌సింగ్‌, గోషామహల్‌-రాజాసింగ్‌, చార్మినార్‌-మేఘారాణి, చాంద్రాయణగుట్ట-సత్యనారాయణ ముదిరాజ్‌, యాకుత్‌పురా-వీరేందర్‌‌యాదవ్‌, బహుదూర్‌పురా-నరేశ్‌కుమార్‌, కల్వకుర్తి-తాల్లోజు ఆచారి, కొల్లాపూర్‌-సుధాకర్‌రావు, నాగార్జునసాగర్‌-కంకణాల నివేదితారెడ్డి, సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి-గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య, జనగామ-ఆరుట్ల దశమంత్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌(ఎస్సీ)-డాక్టర్‌ గుండే విజయరామారావు, పాలకుర్తి-లేగ రామ్మోహన్‌రెడ్డి, డోర్నకల్‌(ఎస్టీ)-భుక్యా సంగీత, మహబూబాబాద్‌(ఎస్టీ)-జతోత్‌ హుస్సేన్‌ నాయక్‌, వరంగల్‌ వెస్ట్‌-రావు పద్మ, వరంగల్‌ ఈస్ట్‌-ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వర్ధన్నపేట(ఎస్సీ)-కొండేటి శ్రీధర్‌, భూపాలపల్లి-చందుపట్ల కీర్తిరెడ్డి, ఇల్లందు(ఎస్టీ)-రవీందర్‌ నాయక్‌, భద్రాచలం(ఎస్టీ)- కుంజా ధర్మారావు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్