||వైసీపీ||
ఈవార్తలు, ఏపీ పాలిటిక్స్: ఏపీలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లను సోమవారం వెల్లడించింది. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు, ఎమ్మెల్యే కోటాలో 7 స్థానాలు, గవర్నర్ కోటాలో 2 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సామాజిక పరిస్థితులు, సమీకరణాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లను ఫైనల్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని వివరించారు.
వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
స్థానిక సంస్థల కోటా అభ్యర్థులు (9 మంది)
నర్తు రామారావు (శ్రీకాకుళం)
కుడిపూడి సూర్యనారాయణ (తూర్పుగోదావరి)
వంకా రవీంద్రనాథ్ (పశ్చిమగోదావరి)
కవురు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి)
మేరుగు మురళీధర్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు)
సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు)
పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (కడప)
ఎ మధుసూదన్ (కర్నూలు)
ఎస్ మంగమ్మ (అనంతపురం)
ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు (ఏడుగురు)
పెన్మత్స సూర్యనారాయణరాజు (విజయనగరం)
పోతుల సునీత (బాపట్ల)
కోలా గురువులు (విశాఖపట్నం)
బొమ్మి ఇజ్రాయిల్ (బీఆర్ అంబేద్కర్ కోనసీమ)
జయమంగళ వెంకటరమణ (ఏలూరు)
చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు)
మర్రి రాజశేఖర్ (పల్నాడు)
గవర్నర్ కోటా అభ్యర్థులు
కుంభా రవిబాబు (అల్లూరి సీతారామరాజు)
కర్రి పద్మశ్రీ (కాకినాడ)