నేడు ఏపీ మంత్రి మండల సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సోమవారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు, సూపర్ సిక్స్ తోపాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. పోలవరం, రాజధాని వంటి వాటికి సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

Chief Minister Chandrababu Naidu

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు 


ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సోమవారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు, సూపర్ సిక్స్ తోపాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. పోలవరం, రాజధాని వంటి వాటికి సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయడంపైనా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో చాలా రోజుల తర్వాత మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మేరకు ఇప్పటికే చేసిన ఐదు సంతకాలకు సంబంధించిన కీలక అంశాలపైన చర్చించేందుకు మంత్రిమండలి సిద్ధమవుతోంది. సంతకాలు చేసిన ఆయా హామీలు వేగంగా అమలు అయ్యేలా చర్యలకు మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కూడా రూపకల్పన చేయాల్సి ఉంది. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు, ఇప్పటికే అమలవుతున్న పథకాలు, ప్రభుత్వ ఖర్చులు.. అన్నిటిని భేరీజు వేసుకొని బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంది. ఆయా అంశాలను పరిగణలో తీసుకునేందుకు అనుగుణంగా  చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా విషయాల్లో కుంభకోణాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలే ఆరోపిస్తున్న వేళ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది.

ఈ సమావేశంలో వీటిపైనా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుకు పలు అంశాలపై లేఖలు రాశారు. ఇసుక, మద్యం పాలసీ వంటి అంశాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మంత్రి మండల సమావేశంలో వీటిపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలు, రుషికొండపై నిర్మించిన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైనా మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోలవరాన్ని సందర్శించారు. అమరావతిలోనూ పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వీటికి సంబంధించిన పనులు పురోగతిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. గతంలో నిర్మించిన నిర్మాణాలు మధ్యలోనే ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తి చేయడంపైన దృష్టి సారించిన ప్రభుత్వం ఈ సమావేశంలో అందుకు అనుగుణంగా నిర్ణయాలను వెలువరించే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు నూతన మద్యం పాలసీ, ఇసుక విధానం వంటి వాటిపైనా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్