రేవంత్ రెడ్డి గారూ ఓసారి కలుద్దాం.. తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

Chandrababu Letter to Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్న ఉద్ధేశంతో ఆయన ఈ లేఖ రాశారు.

chandrababu naidu, revanth reddy

నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి

అమరావతి, ఈవార్తలు : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్న ఉద్ధేశంతో ఆయన ఈ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం విభజన సమస్యలు పరిష్కారం దిశగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఈ లేఖలో చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సమావేశంలో విభజన సమస్యలను చర్చించుకుందామని ఆయన కోరారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకరాలు అందించుకుందామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రాసిన లేఖలో ఏముందంటే.. ’తనదైన ముద్ర వేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు.

మీ చిత్తశుద్ది, నాయకత్వ పటిమ తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి పదేళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. పెండింగడ్‌లో ఉన్న కూర్చుని పరిష్కరించుకుందామని చంద్రబాబు వెల్లడించారు. పెండింగ్‌ సమస్యలు వల్ల అనేక శాఖల్లో సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతున్నట్టు పేర్కొన్నారు. వీటిన్నింటిపైనా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారాలను తీసుకురావచ్చని చంద్రబాబు వెల్లడించారు. ’రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలను ముఖాముఖి సమావేశంలో కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం అవుతాయి. ఇరు రాష్ట్రాల లబ్ధి కలిగేలా పరస్పరం సహకరించుకోవాలి. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్