||ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్||
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-2024 వార్షిక బడ్జెట్ ను మార్చి 16 (ఈరోజు)న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ వార్షిక బడ్జెట్ రాష్ట్రంలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని రైతుల అభివృద్ధి రాష్ట్ర ద్యేయంగా వార్షిక ఆదాయాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అలాగే పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. వైద్యం, గ్రామాల అభివృద్ధి కోసం ముందడుగు వేసేందుకు వార్షిక బడ్జెట్ ని ఏర్పాటు చేసింది.
2023 - 2024 వార్షిక బడ్జెట్ వివరాలీవి..
వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ-రూ.50 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
లా నేస్తం-రూ.17 కోట్లు
జగనన్న తోడు- రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
వైఎస్సార్ కల్యాణమస్తు-రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా-రూ.6700 కోట్లు
వైఎస్సార్ చేయూత-రూ.5000 కోట్లు
అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ రూ. 1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు
కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
ఎనర్జీ- రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం