కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. 15వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
అన్నా క్యాంటీన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. 15వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్నా క్యాంటీన్ లో ప్రజలకు వడ్డించే ఆహారానికి సంబంధించిన మెనూ కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి, లేదా సాంబార్ అందించనున్నారు. పూరి, కుర్మా కూడా ఉండనుంది. మంగళవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కాని ఉప్మాతో చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ వడ్డించనున్నారు. బుధవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్, చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఇవ్వనన్నారు. గురువారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పూరి కుర్మా వడ్డించనున్నారు. శుక్రవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా ఉప్మాతో చట్నీ లేదా పొడి లేదా సాంబర్ ఇవ్వనన్నారు. శనివారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్ తోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజనం లేదా రాత్రివేళ భోజనంలో భాగంగా రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డించనున్నారు. వారంలో ఏడు రోజులు మెనూ ఇలానే ఉండనుంది. కానీ, కూర మాత్రం రోజుకో రకంగా ఉంటుంది. అల్పాహారంలో ఇడ్లీ, పూరి అయితే ఒక్కొక్కరికి మూడు చొప్పున వడ్డించరున్నారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. వైట్ రైస్ 400 గ్రాములు, చెట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు వడ్డించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటల మధ్య ఉంటుంది. మధ్యాహ్నం భోజనం 12:30 నుంచి 3:00 మధ్యలో ఏర్పాటు చేయనున్నారు. రాత్రి భోజనం 7:30 నుంచి 9 గంటల మధ్య ఉంటుంది. ఆదివారం అన్న క్యాంటీన్ కు సెలవు ఉంటుంది. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు.
విశాఖ నుంచి కృష్ణా జిల్లాకు మారిన షెడ్యూల్..
కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. తొలుత విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్ సీఎం చంద్రబాబు నాయుడు భావించారు. అయితే, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండడంతో కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాకు మార్పు చేసుకున్నారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తున్నప్పటికీ 16వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో 100 ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలో మాత్రమే వీటిని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.